AP Free House Scheme : కొత్త ఇళ్లు కావాలంటే.. ఈ అర్హతలు ఉండాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్తం పేద ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. నిరుపేదలకు ఉచితంగా స్థలాలను కేటాయించబోతుంది. గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాల్లో నివాస స్థలాలు కేటాయించడంతో చాలా మంది ఇళ్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు.. ఈ కేటాయింపులను రద్దు చేసి కొత్త పట్టాలను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక కొత్తగా ఇళ్ల స్థలాలకు అప్లయ్ చేసుకోబోతున్నారో వారికి సంబంధించి విధి విధానాలను తెలియచేసింది.
కొత్త ఇళ్ల స్థలాల కోసం విధివిధానాలు:
AP Housing :
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇళ్ల స్థలాల కోసం విధివిధానాలను మంత్రి పార్థసారధి మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. గ్రామాల్లో ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్ల చొప్పున ఉచితంగా ఇవ్వనున్నారు. మరి కొత్తగా ఇళ్ల స్థలాలు కావాలంటే ఏ అర్హతలు ఉండాలో ఇప్పుడు చూద్దాం..
ఏ అర్హతలు ఉండాలి:
-కొత్తగా ఇళ్ల స్థలాల కోసం అప్లయ్ చేసే వారు గతంలో హైసింగ్ స్కీమ్ లో వారి కుటుంబంలో ఎవరూ లబ్ధి పొంది ఉండకూడదు.
-బిపీఎల్ కుటుంబానికి చెందిన వారు అయి ఉండాలి.
-ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి.
-మెట్ట భూమి అయితే 5 ఎకరాల లోపు ఉండాలి. అదే మాగాణి అయితే 2.5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.
-గత ప్రభుత్వంలో జగన్న కాలనీల పేరుతో ఒక సెంట్ స్థలం అయితే చెప్పింది. అందులో రెండు మూడు విడతల్లో ఇల్లు కడతామన్నారు. మొదటి విడతల కొంత మంది కట్టారు. రెండో విడతలో చాలా కట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే.. గతంలో ఎవరైతే ఇల్లు కట్టుకలేదో.. అంటే ఇంటి స్థలం ఇచ్చి పట్టా కూడా పొందిన వారు ఇళ్లు కట్టుకోని వారి పట్టాను రద్దు చేసి.. వారు కోరినట్లు అయితే వారికి గ్రామాల్లో అయితే 3, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెబుతున్నారు.
-ఇళ్లపై సోలార్ పవర్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది..
Also Read : How To Apply New Ration Cards In Andhra Pradesh
Also Read : How To Download Ration Card Online
సచివాలయాల తగ్గింపు:
గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. 2 వేల జనాభా ఉన్న ప్రతి ప్రాంతంలో ఒక సచివాలయం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. వారికి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని అక్కడ చూడాలనే ఉద్దేశంతో సచివాలయాలు ప్రారంభించారు. ఆ సచివాలయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 11 మంది ఉద్యోగులను, పట్టణ ప్రాంతాల్లో అయితే 10 మంది ఉద్యోగులను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం సచివాలయాల్లో సిబ్బందిని తగ్గించాలని నిర్ణయిచింది. సచివాలయాలను మూడు కేటగిరీల్లో విభజించారు.
మొదటి కేటగిరి:
2,500 జనాభా కంటే తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఒక కేటగిరిగా తీసుకుంటారు. అక్కడ 6 మంది ఉద్యోగులను పెట్టనున్నారు. అందులో ఇద్దరు మల్టీపర్పస్ ఉద్యోగులు, మరో నలుగురు టెక్నికల్ గా అయితే ఉంటారు.
రెండో కేటగిరి:
2500 నుంచి 3500 జనాభా కలిగి ఉన్న సచివాలయాన్ని రెండో కేటగిరీగా విభజించారు. అక్కడ 7 మంది ఉద్యోగులను పెట్టనున్నారు. వారి ముగ్గురు మల్టీపర్పస్, నలుగురు టెక్నికల్ ఉద్యోగులుగా పెడతారు.
మూడో కేటగిరి:
3500 కంటే ఎక్కవ జనాభా కలిగి ఉన్న సచివాలయాన్ని మూడో కేటగిరీగా విభజించారు. ఆ సచివాలయంలో 8 మంది ఉద్యోగులను పెడతారు. వారిలో నలుగురు మల్టీపర్పస్, నలుగురు టెన్నికల్ ఉద్యోగులుగా విధులు నిర్వహించాలి.
మల్లీపర్పస్ ఉద్యోగులు ఎవరంటే:
మల్టీపర్పస్ ఉద్యోగులను ఎవరిని పెట్టనున్నారని చూసుకుంటే.. పంచాయతీ/అడ్మిన్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, వెల్ఫేస్ సెక్రటరీ, మహిళా పోలీస్. ఈ నలుగురు ఉద్యోగులను మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అంటారు.
టెక్నికల్ ఉద్యోగులు:
గ్రామాల్లో :
గ్రామాల్లో అయితే టెక్నికల్ ఫంక్షనరీస్ కింద 7 మంది ఉద్యోగులను కేటాయించారు. వీఆర్వో, ఏఎన్ఎమ్, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చరర్ అసిస్టెంట్, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీ.
పట్టణాల్లో :
పట్టణాల్లో అయితే టెక్నికల్ ఫంక్షనరీస్ ఉద్యోగులు 6 మంది వస్తారు. డబ్ల్యుఆర్ఎస్, హెల్త్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, వార్డు శానీటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు.