ఈ సర్వే ప్రకారమే కొత్త రేషన్ కార్డులు..
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధివిధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులు దేనిని ప్రమాణికంగా తీసుకొని జారీ చేయడం జరుగుతుంది? ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారనే దానిని ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఏ ప్రాతిపదికన ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అంటే… ఒక నెల క్రితం కుల గణన సర్వే అనేది జరిగింది. కుల గణనలో రేషన్ కార్డులు లేని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ కుల గణన సర్వేతో పాటు గతంలో మీసేవలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి.
ఈ కొత్త రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు.. వీరి వివరాలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ కుల గణన సర్వే మరియు గతంలో దరఖాస్తు చేసుకున్న వారి డేటా బేస్ చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.
అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు?
ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఈ డేటా ప్రకారం అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు అంటే.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఈ డేటాను జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. అక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్ల లాగిన్ లకు ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎండీఓలకు పంపుతారు. వీరి లాగిన్ లకు జాబితా వచ్చిన తర్వాత గ్రామసభలు, వార్డు సభలు, బస్తీ సభలు నిర్వహిస్తారు. ఈ సభలు నిర్వహించే సంధర్భంలో ఆ జాబితాను డిస్ల్పే చేసి ప్రజల ముందు ఉంచుతారు.
రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పకుండా ఈ సభలకు వెళ్లాలి. ఒక వేళ మీ పేరు లేకపోతే అక్కడే అధికారులకు ద్రుష్టికి తీసుకెళ్తే వారు అక్కడ నమోదు చేసుకుంటారు. కాబట్టి గ్రామ సభలకు తప్పకుండా వెళ్లాలి. ఈ విధంగా గ్రామ సభల్లో వారి వివరాలు చదివి వినిపించిన తర్వాత లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ విధంగా గుర్తంచిన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీఓల లాగిన్ లో, మున్సిపల్ కమిషనర్ల లాగిన్ లో భద్రపరచడం జరుగుతుంది.
Also Read : రేషన్ కార్డు ఆన్ లైన్ లో ఎలా డౌన్ లోడ్ చేయాలి?
Also Read : What is required Documents for a new ration card In Andhra Pradesh ? Who is eligible?
ఈ విధంగా భద్రపరిచిన తర్వాత మళ్లీ తిరిగి కలెక్టర్ కార్యాలయానికి ఈ అర్హుల జాబితాను పంపడం జరుగుతుంది. అక్కడ జిల్లా కలెక్టర్లు క్షణ్ణంగా పరిశీలిస్తారు. అలా అర్హులైన వారి జాబితాను పౌరసరఫరాల శాఖకు సంబంధించి కమిషనర్ ఉంటారు. వారి లాగిన్ కి ఈ వివరాలు పంపిస్తారు. విధంగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కు పంపిన అర్హుల జాబితాను ప్రభుత్వం గుర్తించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఈనెల 26వ తేదీ వరకు జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంటే ఈనెల 20 తర్వాత గ్రామాల్లో, వార్డుల్లో, బస్తీల్లో సభలు నిర్వహిస్తారు. ఈ గ్రామ సభల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభలు నిర్వహించే సమయంలో తప్పకుండా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు, పాత రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది.