IBPS PO/MT Recruitment 2025 | వివిధ బ్యాంకుల్లో 5,208 పీఓ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

By: Afzal

On: July 1, 2025

Follow Us:

IBPS PO/MT Recruitment 2025

IBPS PO/MT Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 1వ తేదీ నుంచి జూలై 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

IBPS PO/MT Recruitment 2025 overview : 

నియామక సంస్థఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS)
పోస్టు పేరుప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ
ఖాళీల సంఖ్య5,208
జాబ్ లొకేషన్పాన్ ఇండియా

పోస్టుల వివరాలు : 

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) వివిధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 5,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

బ్యాంకుల వారీగా ఖాళీలు

బ్యాంకు పేరుఖాళీలు
బ్యాంక్ ఆఫ్ బరోడా1,000
బ్యాంక్ ఆఫ్ ఇండియా700
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర1000
కెనరా బ్యాంకు1000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా500
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్450
పంజాబ్ నేషనల్ బ్యాంక్200
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్358

అర్హతలు : 

IBPS PO/MT Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి : 

IBPS PO/MT Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IBPS PO/MT Recruitment 2025 పోస్టులకు ఆన్ లైన్ విధానంలో డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ / యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • UR / EWS / OBC : రూ.850/-
  • SC / ST / PwD : రూ.175/- 

ఎంపిక ప్రక్రియ: 

IBPS PO/MT Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • ప్రిలిమినరీ ఎగ్జామ్
  • మెయిన్స్ ఎగ్జామ్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

IBPS PO/MT Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480/- నుంచి రూ.85,920/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

IBPS PO/MT Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • హోమ్ పేజీలో ‘CRP PO / MT’ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • రిజిస్ట్రేసన్ నంబర్ మరియు పాస్ వర్డ్ ద్వారా ప్రాథమిక వివరాలను నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తులు ప్రారంభ తేదీ01 జూలై, 2025
దరఖాస్తులకు చివరి తేదీ21 జూలై, 2025
ప్రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ తేదీఆగస్టు, 2025
ప్రీ ఎగ్జామ్ తేదీఆగస్టు, 2025
ప్రీ ఎగ్జామ్ ఫలితాలను అప్ లోడ్ చేసిన తేదీసెప్టెంబర్, 2025
మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డు డౌన లోడ్ తేదీఅక్టోబర్, 2025
మెయిన్స్ పరీక్ష తేదీఅక్టోబర్, 2025
మెయిన్స్ పరీక్ష ఫలితాలునవంబర్, 2025
ఇంటర్వ్యూ తేదీడిసెంబర్ 2025 / జనవరి 2026
తాత్కాలిక కేటాయింపు తేదీజనవరి / ఫిబ్రవరి 2026
NotificationClick here
Apply OnlineClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment