Telegram Group
Join Now
---Advertisement---
AP Inter Public Exams 2025-26

AP Inter Public Exams 2025-26 : ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు | కీలక మార్పులు, కొత్త విధానం

By Afzal

Published on:

AP Inter Public Exams: 2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతవరకు ప్రతి ఏడాది మార్చి నెలలో జరిగే ఇంటర్ పరీక్షలు ఈసారి ఒక నెల ముందుగానే జరగనున్నాయి. అంటే 2026 ఫిబ్రవరి నెలలోనే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించబోతున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

 

ఎందుకు ఫిబ్రవరిలోనే పరీక్షలు?

ఇప్పటివరకు ఇంటర్ పరీక్షలు ఎప్పుడూ మార్చిలోనే జరిగాయి. కానీ ఈసారి సీబీఎస్సీ (CBSE) షెడ్యూల్‌ కు అనుగుణంగా ఫిబ్రవరిలోనే పరీక్షలు పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఇలా నిర్వహించడం వల్ల పరీక్షలు త్వరగా పూర్తి అవుతాయి. అంతేకాదు ఏప్రిల్ నెలలోనే కొత్త తరగతులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ విధానం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. 

Also Read : AP NHM APVVP Notification 2025 | ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ జాబ్స్

పరీక్షల నిర్వహణలో కొత్త మార్పులు

ఈసారి పబ్లిక్‌ పరీక్షల్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు.

  • మొదట సైన్స్ గ్రూప్ సబ్జెక్టులకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇంతకు ముందు లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి ఈ విషయంలో మార్పులు చేస్తున్నారు.
  • రోజుకు ఒకే సబ్జెక్టు పరీక్ష మాత్రమే ఉంటుంది.
  • గతంలో ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్ విద్యార్థులకు ఒకేరోజు వేర్వేరు సబ్జెక్టుల పరీక్షలు ఉండేవి. కానీ ఈసారి అలా ఉండదు.
  • విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, ఒక రోజు ఒక పరీక్ష రాయగలిగేలా బోర్డు నిర్ణయం తీసుకుంది.

కొత్తగా ప్రవేశపెట్టిన గ్రూపులు

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు ఎంబైపీసీ (MBiPC) అనే కొత్త గ్రూపును ప్రవేశపెట్టింది.  అలాగే, విద్యార్థులకు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ విధానం వల్ల ఒక విద్యార్థి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు చదివే అవకాశం ఉంటుంది.

also Read : Cotton Corporation of India Jobs 2025 |  కేవలం ఇంటర్వ్యూతోనే రూ.37,000 జీతంతో జాబ్

సైన్స్ పరీక్షలు పూర్తయ్యాకే ఇతర పరీక్షలు

సైన్స్ సబ్జెక్టులు పూర్తయ్యాక భాషా సబ్జెక్టులు జరుగుతాయి. ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్‌ పరీక్షలు ఉంటాయి. ఇలా ఒక్కోరోజు ఒక్కో పరీక్ష మాత్రమే ఉండటం వల్ల, విద్యార్థులు రెండు పరీక్షలు ఒకే రోజు రాయాల్సిన అవసరం ఉండదు.

ప్రాక్టికల్‌ పరీక్షలపై ఇంకా నిర్ణయం లేదు

ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరి చివరలోనే నిర్వహించాలా? లేక రాత పరీక్షల తర్వాత నిర్వహించాలా? అనే విషయంపై బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలో ఈ విషయం ప్రకటించే అవకాశం ఉంది.

విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు

  • దీని వల్ల విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గుతుంది.
  • రోజుకు ఒక్క పరీక్ష ఉండడం వల్ల సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం లభిస్తుంది.
  • త్వరగా పరీక్షలు ముగిసిన తర్వాత, కొత్త తరగతులు ముందుగానే ప్రారంభం అవుతాయి.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 ద్వారా విద్యార్థులు కొత్త అనుభవాన్ని పొందుతారు.  ఫిబ్రవరిలో పరీక్షలు జరగడం, రోజుకు ఒకే పరీక్ష ఉండటం విద్యార్థులకు సులభతరం చేస్తాయి. అదేవిధంగా, కొత్త గ్రూపులు, సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం కూడా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

Also Read : NHPC 2025 Notification | Salary ₹1.4 Lakh వరకు | వెంటనే అప్లై చేయండి

Afzal

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Leave a Comment

Follow Google News